ఆచార్యకు మహేష్ మాట సాయం.. చిరంజీవి ట్వీట్ వైరల్
Mahesh Babu voice over to Acharya movie.మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో
By - తోట వంశీ కుమార్ |
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించారు. చిరు సరసన కాజల్, చరణ్ కు జతగా పూజా హెగ్డే నటించిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్స్ బ్యానర్స్పై నిరంజన్ రెడ్డి, రామ్చరణ్లు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. కాగా.. ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించనున్నారు అనే వార్త చక్కర్లు కొట్టగా.. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. అది నిజమేనంటూ చెప్పేసింది. ఈ మేరకు ఈ రోజు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించేసింది.
#SSMBForAcharya 🔥
— Matinee Entertainment (@MatineeEnt) April 22, 2022
Super🌟 @urstrulyMahesh will introduce Dharmasthali with his voice on the Big Screens 💥💥#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @hegdepooja @SonuSood #Manisharma @NavinNooli @DOP_Tirru @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/loU3vvuBZA
ఇక తన చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'డియర్ మహేష్.. ఆచార్య లోని పాదఘట్టాన్ని నీ వాయిస్ ఓవర్తో అందరికీ పరిచయం చేయనున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎంతో ప్రత్యేకమైన విధంగా ఈ చిత్రంలో నువ్వు కూడా భాగమైనందుకు ధన్యవాదాలు. నీ వాయిస్ విని నేనూ, చరణ్ ఎంతలా థ్రిల్ అయ్యామో.. అదే విధంగా అభిమానులు, ప్రేక్షకులు కూడా సంతోషిస్తారు' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Dearest @urstrulyMahesh Delighted to have you introduce 'Padaghattam' in your endearing voice in #Acharya
— Acharya (@KChiruTweets) April 22, 2022
Thank you for becoming a part of the film in a very special way!! I am sure fans & audiences will be just as thrilled to hear you as much as @AlwaysRamCharan & I loved it!