విషాదం.. మ‌హ‌ర్షి ఫేమ్ గురుస్వామి క‌న్నుమూత‌

Maharshi Actor Guruswamy passed away.మ‌హ‌ర్షి చిత్రంలో రైతు పాత్ర‌లో న‌టించి గుర్తింపు పొందిన గురుస్వామి క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Sep 2022 3:54 AM GMT
విషాదం.. మ‌హ‌ర్షి ఫేమ్ గురుస్వామి క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన 'మ‌హ‌ర్షి' చిత్రంలో రైతు పాత్ర‌లో న‌టించి గుర్తింపు పొందిన న‌టుడు గురుస్వామి క‌న్నుమూశారు. గ‌త కొద్ది రోజులుగా గురుస్వామి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందారు. మూడు రోజుల క్రిత‌మే క‌ర్నూలులోని బాలాజీన‌గ‌ర్‌లోని స్వ‌గృహానికి వెళ్లారు. ఇంటి ద‌గ్గ‌రే చికిత్స తీసుకుంటుండ‌గా.. శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుది శ్వాస విడిచారు.

క‌ర్నూలు జిల్లా వెల్దుర్తి ఆయ‌న స్వ‌గ్రామం. బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. నాట‌కాల‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించారు. 2019లో వచ్చిన 'మహర్షి' చిత్రంతో నటుడిగా గురుస్వామికి గుర్తింపు వచ్చింది. పంచెకట్టులో తలపాగ చుట్టుకుని, భుజంపై నాగలితో ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. మట్టికి, రైతుకు మధ్య బంధాన్ని చెప్పే క్రమంలో ఆయన అద్భుతంగా న‌టించారు. ఆ త‌రువాత 'భీష్మ‌', 'ఉప్పెన', 'వ‌కీల్ సాబ్‌', 'రిప‌బ్లిక్' త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. గురుస్వామి మృతి పట్ల పలువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Next Story