'తెలిసి మరీ ఇరుక్కుంది'.. దోపిడీ కేసులో స్టార్‌ హీరోయిన్‌

Heroine Jacqueline Fernandez has been found guilty in the Rs 200 crore money laundering case. బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఆరోపణలు

By అంజి  Published on  17 Aug 2022 9:46 AM GMT
తెలిసి మరీ ఇరుక్కుంది.. దోపిడీ కేసులో స్టార్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆర్థిక నేరగాడు సుకేష్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొంది. ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును చేర్చింది. సుకేష్‌ దోపిడీ చేసిన డబ్బు నుంచి జాక్వెలిన్‌ లబ్ది పొందినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సుకేష్‌ చంద్రశేఖర్‌ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలిసినా.. అతడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించిందని ఈడీ వర్గాలు తెలిపారు.

సుకేష్‌ నుంచి జాక్వెలిన్‌ విలువైన గిఫ్ట్‌లు అందుకున్నట్లు తేలింది. అత్యంత ఖరీదైన డిజైనర్‌ బ్యాగ్‌లు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్‌, మినీ కూపర్‌, ఇలా దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులను జాక్వెలిన్‌, ఆమె ఫ్యామిలీకి సుకేష్‌ ఇచ్చిన ఈడీ గుర్తించింది. సుకేష్‌తో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ పలుమార్లు జాక్వెలిన్‌కు సమన్లు జారీ చేసింది.

ఇటీవల జాక్వెలిన్ విదేశాలకు వెళ్లకుండా లుక్‌అవుట్‌ నోటీసులు కూడా ఈడీ జారీ చేసింది. అయితే దీనిపై జాక్వెలిన్‌ కోర్టుకు వెళ్లగా.. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు పర్మిషన్‌ ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27కోట్ల ఆస్తులను అధికారులు జప్తు చేసుకున్నారు. ఇందులో రూ.7 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే ఉన్నాయి. రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించిన సుకేష్‌.. వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు.

Next Story