సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. క‌మెడియ‌న్ మయిల్‌స్వామి క‌న్నుమూత‌

Famous Comedian Mayilsamy passed away.సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2023 5:41 AM GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. క‌మెడియ‌న్ మయిల్‌స్వామి క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. తార‌క‌ర‌త్న మ‌ర‌ణ‌వార్త‌ను మ‌రువ‌క‌ముందే మ‌రో న‌టుడు క‌న్నుమూశాడు. ప్ర‌ముఖ కోలీవుడ్ హాస్య న‌టుడు మయిల్‌స్వామి మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌స్సు 57 సంవ‌త్స‌రాలు. శ‌నివారం రాత్రి మయిల్‌స్వామి అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను పోరూరులోని రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. మయిల్ స్వామి మృతితో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయన మరణం పట్లు పలువురు సినీ ప్రముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలుపుతున్నారు.

1965 అక్టోబర్ 2న ఈరోడ్ జిల్లా సత్యమంగళంలో మయిల్‌స్వామి జన్మించారు. 1980లో చెన్నైకి వ‌చ్చారు. 1984లో ‘ధవని కనవుగల్‌’ అనే చిత్రంతో ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. విజయ్, విక్రమ్, అజిత్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లోనూ న‌టించారు. నాలుగు ద‌శాబ్ధాల కెరీర్‌లో సుమారు 200 చిత్రాల్లో నటించారు. ఆయ‌న న‌టించిన 'గ్లాస్‌మేట్' చిత్రం ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

Next Story