విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో తమన్నా, మెహ్రీన్లు కథానాయికలు నటిస్తున్నారు. 'ఎఫ్ 2'కు సీక్వెల్గా మూడు రెట్ల ఫన్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఈ చిత్ర విడుదల రెండు సార్లు వాయిదా పడగా.. తాజాగా మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కావాల్సి ఉండగా.. అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రం విడుదల అవుతుండడంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్కు వాయిదా వేశారు. దేవీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.