రియల్ ఎస్టేట్ మాయాజాలం.. రూ. 7 కోట్లు గోవిందా!.. మోసపోయిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల

ప్రముఖ టాలీవుడ్‌ సినీ దర్శకుడు శ్రీను వైట్ల, ఆయన మేనకోడలు శ్వేత భూమి పెట్టుబడి పేరుతో కొందరు వ్యక్తుల చేతిలో దారుణంగా మోసపోయారు...

By -  అంజి
Published on : 25 March 2026 10:07 AM IST

Srinu Vaitla Land Fraud, Hyderabad CCS Police Case, Vikarabad Land Scam, Tollywood News, Real Estate Fraud Telangana, Forged Land Documents, Swetha Srinu Vaitla Niece

రియల్ ఎస్టేట్ మాయాజాలం.. రూ. 7 కోట్లు గోవిందా!.. మోసపోయిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల

ప్రముఖ టాలీవుడ్‌ సినీ దర్శకుడు శ్రీను వైట్ల, ఆయన మేనకోడలు శ్వేత భూమి పెట్టుబడి పేరుతో కొందరు వ్యక్తుల చేతిలో దారుణంగా మోసపోయారు. 2019లో వికారాబాద్ జిల్లాలోని కడ్మూర్ ప్రాంతంలో లాభదాయకమైన భూమి ఉందని నమ్మించి, ఒక ముఠా వీరిని సంప్రదించింది. అధిక లాభాలు వస్తాయన్న ఆశతో శ్రీను వైట్ల ఈ భూమిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. నిందితులు అత్యంత పక్కా పథకం ప్రకారం నకిలీ పత్రాలను సృష్టించి, ఆ భూమి తమదేనని వీరిని నమ్మించారు. ఆ పత్రాలను నిజమని నమ్మిన శ్రీను వైట్ల, ఒప్పందం ప్రకారం భారీ మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు.

అయితే, అసలు కథ రిజిస్ట్రేషన్ తర్వాత మొదలైంది. తాము కొన్న భూమి అమ్మిన వారికి సంబంధం లేనిదని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమను బురిడీ కొట్టించారని ఆలస్యంగా గుర్తించారు. ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం ఆ భూమి విలువ దాదాపు ₹7.2 కోట్లు ఉంటుందని దర్శకుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక పథకం ప్రకారం కుట్ర పన్ని తమను మోసం చేశారని ఆయన పోలీసులకు వివరించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేశారు? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Next Story