సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

Director KS Sethumadhavan passed away.క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌రుస విషాదాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2021 4:14 AM GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒక‌రి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌ముందే మ‌రొక‌రు మ‌ర‌ణిస్తున్నారు. తాజాగా ద‌క్షిణ భార‌త ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కెఎస్‌.సేతు మాధ‌వ‌న్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 90 సంవ‌త్స‌రాలు. వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చెన్నైలోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతి మ‌ట్ల సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

1931లో కేరళలోని పాలక్కడ్‌లో సేతు మాధ‌వ‌న్ జ‌న్మించారు. ఆయన పూర్తి పేరు కే.సుబ్రహ్మణ్యం సేతు మాధవన్‌. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్‌, ఉమ, సంతోష్ సేతు మాధవన్‌ ఉన్నారు. 1961లో 'జ్ఞాన సుంద‌రి' అనే మ‌ల‌యాళ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌రువాత హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ, తెలుగు బాష‌ల్లో 60పైకి చిత్రాల‌కు ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఇక టాలీవుడ్‌లో 1995లో వ‌చ్చిన 'స్త్రీ' చిత్రానికి కూడా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 1991లో 'మరుపక్కమ్‌' అనే తమిళ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. 2009లో అతన్ని జెస్సీ డేనియల్ అవార్డుతో సత్కరించారు. అనేక సాహిత్య రచనలకు దర్శకత్వం వహించిన సేతుమాధవన్ నాలుగుసార్లు ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర అవార్డును అందుకున్నారు.

Next Story