అఫీషియల్.. ధనుష్తో శేఖర్ కమ్ముల చిత్రం
Dhanush and sekhar kammula project conformed.కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
By తోట వంశీ కుమార్
కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ త్రిభాషా చిత్రానికి రూపకల్పన చేయడం షాకింగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. దివంగత సునీతా నారంగ్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సోనాలి నారంగ్ ప్రకటించారు.
Truly excited and charged.
— Sekhar Kammula (@sekharkammula) June 18, 2021
A star who enjoys his peformance, finds purpose in his performance - Dhanush. @dhanushkraja, Let's do it once more.@SVCLLP, Happy to continue the association with Narayan Das K. Narang Gaaru n Puskur Ram Mohan Rao Gaaru. pic.twitter.com/0WYw8bfHOu
రెండు నేషనల్ అవార్డ్స్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గానే కాక గ్లోబల్ స్టార్గా సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు. హాలీవుడ్లో 'ది గ్రేమ్యాన్' చిత్రంలో నటిస్తున్నారు. అవెంజర్స్ దర్శకులు రస్సో బ్రదర్స్ ఈ చిత్రానికి దర్శకులు. కాగా.. ధనుష్ నటించిన తాజా చిత్రం జగమే తంత్రం (జగమే తందిరం-తమిళ్) నేటి మధ్యాహ్నాం నెట్ఫిక్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా రస్సో బ్రదర్స్ అతడికి శుభాకాంక్షలు చెప్పడం అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ఇక శేఖర్ కమ్ముల విషయానికి వస్తే ఆయన తెరకెక్కించిన లవ్ స్టోరీ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.