"భైరవం" సినిమా గురించి బాగా ప్రచారం చేశారు. ముగ్గురు హీరోలు ఉండడంతో మంచి కలెక్షన్స్ వస్తాయని ఆశించారు. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టలేకపోయింది. మొదటి రోజు కేవలం తక్కువ కలెక్షన్లను మాత్రమే సాధించింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 2. 75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను మాత్రమే సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా బడ్జెట్ 30 కోట్లకు పైగా ఉంది.
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ స్నేహితులుగా నటించారు. ఈ చిత్రం తమిళ చిత్రం గరుడన్ రీమేక్. తమిళనాడులో బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. తమిళ ఒరిజినల్ మాదిరిగా కాకుండా, తెలుగులో భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ శని, ఆదివారాల్లో సినిమాకు మంచి కలెక్షన్స్ రావాల్సి ఉంది.