"ఊర్వశివో రాక్షసివో" కోసం బాలయ్య.. అల్లు ఫ్యామిలీతో నందమూరి ఫ్యామిలీ ప్రత్యేక అనుబంధం !
Balakrishna will be the chief guest at the pre-release function of the movie “Urvashivo Rakshasivo”. నటసింహం బాలయ్య బాబు అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరవుతున్నారు. 'అన్ స్టాపబుల్' టాక్ షో కారణంగా అల్లు అరవింద్ కి
నటసింహం బాలయ్య బాబు అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరవుతున్నారు. 'అన్ స్టాపబుల్' టాక్ షో కారణంగా అల్లు అరవింద్ కి బాలయ్యకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఈ అనుబంధమే అల్లు శిరీష్ కి ప్లస్ కాబోతుంది. అల్లు శిరీష్ హీరోగా రాబోతున్న తదుపరి చిత్రం "ఉర్వశివో రాక్షసివో". ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బాలయ్య బాబు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడు. అక్టోబర్ 30న జేర్సీ కన్వెక్షన్ హాల్ లో జరనున్న ఈ భారీ ఈవెంట్ కి బాలయ్య స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు. మరీ బాలయ్య బాబు ఈ ఉర్వశివో రాక్షసివో గురించి ఎలాంటి పలుకులు పలుకుతాడో చూడాలి. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో శిరీష్,అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. "ఊర్వశివో రాక్షసివో" చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమా పై అంచనాలు పెంచడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బాలయ్య బాబును తీసుకు వస్తున్నారు. మరీ ఈ సినిమా పై బాలయ్య ముద్ర పడితే.. కచ్చితంగా సినిమాకి ప్లస్ కానుంది.