ఆదిపురుష్ సినిమా.. ఆ హీరోలు ఒక్కొక్క‌రు 10,000 టికెట్లు కొనుగోలు చేస్తార‌ట‌..!

After Ranbir Kapoor, Ram Charan to buy 10000 tickets of Prabhas starrer. కృతి సనన్, ప్రభాస్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదలవుతోంది.

By Medi Samrat
Published on : 10 Jun 2023 6:22 PM IST

ఆదిపురుష్ సినిమా.. ఆ హీరోలు ఒక్కొక్క‌రు 10,000 టికెట్లు కొనుగోలు చేస్తార‌ట‌..!

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేప‌థ్యంలోనే సినిమా విస్తృతంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రామ్ పాత్రలో న‌టిస్తుండగా, కృతి స‌న‌న్ సీత పాత్రలో కనిపించింది. ఇక‌ సినిమాను వివాదాలు కూడా బాగానే వెంటాడుతున్నాయి. ఈ సినిమాలోని పాత్రల లుక్‌పై కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే రణబీర్ కపూర్ 10,000 టిక్కెట్లు కొంటాన‌ని చెప్ప‌గా.. ఇప్పుడు రామ్ చరణ్ కూడా 10,000 టిక్కెట్లు కొనుగోలు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

రణబీర్ వలె రామ్ చరణ్ నిరుపేద పిల్లలకు, అతని అభిమానులకు 10,000 కంటే ఎక్కువ టిక్కెట్లను కొనుగోలు చేసి ఇవ్వనున్నారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. గతంలో అభిషేక్ అగర్వాల్ కూడా ఇలాంటి ప్రకటనే చేయ‌డం విశేషం. ఆదిపురుష్ చిత్రాన్ని దేశవ్యాప్తంగా 6200కి పైగా స్క్రీన్‌లలో విడుదల చేస్తున్నారు. ఈ ఆదివారం నుంచి టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో హీరోలు ఎక్కువ మొత్తంలో టికెట్లు కొనుగోలు చేసి నిరుపేద, అనాథ‌ పిల్లలతో పాటు త‌మ అభిమానులకు ఆదిపురుష్‌ను థియేట‌ర్ల‌లో చూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

గతంలో ఆదిపురుష ట్రైలర్‌పై రచ్చ జరిగిన తర్వాత మేకర్స్‌ చాలా మార్పులు చేసి.. కొత్త ట్రైలర్‌ని విడుదల చేసినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ న‌డుస్తోంది. 'రామాయణం'లో సీత పాత్రలో నటించిన దీపికా చిఖాలియా.. సినిమా ట్రైలర్‌లో వీఎఫ్‌ఎక్స్‌తో కూడి ఓవర్‌లోడ్‌గా ఉందని, దానితో పాటు సీతాహరన్ సన్నివేశాలను కూడా తప్పుగా చూపించారని చెప్పింది.


Next Story