'మూడేళ్లుగా ఆ ఇద్దరు వేధిస్తున్నారు'.. నటి సంచలనం
మూడేళ్లుగా తాను సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొంటున్నట్టు నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఐజీలో కోరారు.
By - అంజి |
'మూడేళ్లుగా ఆ ఇద్దరు వేధిస్తున్నారు'.. నటి సంచలనం
మూడేళ్లుగా తాను సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొంటున్నట్టు నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఐజీలో కోరారు. ఈ విషయమై చట్టపరంగా వెళ్లినా వేధింపులు ఆగలేదన్నారు. సబరిష్ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి నకిలీ ఖాతాల ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తున్నట్టు తెలిపారు. లవ్ టుడేలో నటించిన రవీనా త్రిష, దీపికా పదుకొణె, సమంత వంటి స్టార్లకు డబ్బింగ్ చెప్పారు.
ఇద్దరు వ్యక్తుల చిత్రాలను, వారు రాసినట్లు చెప్పబడుతున్న కొన్ని పోస్ట్లను ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ, "ప్రజా అవగాహన: విస్మరించవద్దు. మూడు సంవత్సరాలుగా మమ్మల్ని వేధిస్తున్న ఒక వేధింపుదారుడి నుండి నా కుటుంబాన్ని, నా స్నేహితులను, నన్ను రక్షించుకోవడానికి నేను దీన్ని పోస్ట్ చేస్తున్నాను" అని రాశారు. "పోలీసు ఫిర్యాదులు, హెచ్చరికలు దీనిని ఆపివేస్తాయని ఆశిస్తూ నేను మౌనంగా ఉన్నాను. దురదృష్టవశాత్తు, సబరీష్ అనే వ్యక్తి, అతని కవల సోదరుడు నన్ను, నా కుటుంబాన్ని, నా స్నేహితులను వేధిస్తూనే ఉన్నారు. వారు సందేశాలు, వ్యాఖ్యలలో అసహ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారు, నన్ను మాత్రమే కాకుండా నాకు దగ్గరగా ఉన్నవారిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. నా కారణంగా దీనిని ఎదుర్కోవలసి వచ్చిన నా స్నేహితులు, కుటుంబ సభ్యులకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. మేము చట్టపరమైన మార్గాన్ని ప్రయత్నించాము, కానీ వేధింపులు ఆగలేదు" అని పేర్కొన్నారు.
ఇక ఇటీవలే నటి ఈషా రెబ్బ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్న తన ఫోటోలు, వీడియోలకు ఒక వ్యక్తి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కామెంట్లు పెడుతున్నాడని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె తన ఫిర్యాదులో అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి సంబందించిన ఇన్స్టాగ్రామ్ ఐడీ వివరాలు, అతడు చేసిన కామెంట్ల స్క్రీన్ షాట్లను కూడా ఈషా రెబ్బ పోలీసులకు అందజేశారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికలలో మహిళలను వేధించడం నేరమని, ఇలాంటి ఘటనల్లో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.