కంచె భామ‌కు క‌రోనా.. ఆందోళ‌న‌లో బాల‌య్య అభిమానులు

Actress Pragya Jaiswal tested covid 19 positive.కంచె చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ముద్దుగుమ్మ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Oct 2021 10:00 AM GMT
కంచె భామ‌కు క‌రోనా.. ఆందోళ‌న‌లో బాల‌య్య అభిమానులు

కంచె చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్‌. తాజాగా ఈ భామ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది ప్ర‌గ్యా. ఆదివారం జ‌రిపిన క‌రోనా ప‌రీక్షల్లో త‌న‌కు పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలిపింది. తాను రెండు డోసుల టీకా తీసుకున్నా కూడా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు చెప్పింది. ప్ర‌స్తుతం తాను ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని.. గ‌త ప‌ది రోజులుగా త‌న‌ను క‌లిసిన వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరింది. త‌న‌కు క‌రోనా రావ‌డం ఇదే తొలిసారి కాద‌ని.. వ్యాక్సిన్ వేసుకోక ముందు ఓ సారి వ‌చ్చిన‌ట్లు గుర్తుచేసుకుంది.

నందమూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న అఖండ చిత్రంలో ప్ర‌గ్యా న‌టించింది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్నిద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి దర్శకుడు బోయపాటితో పాటు నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు కూడా పాల్గొనగా బాలయ్య, ప్రగ్యా ఈ పార్టీకి హైలెట్ గా నిలిచారు. బాల‌య్య‌తో క‌లిసి ఫోటోల‌కు ఫోజులిచ్చింది. ఇప్ప‌డు ఇదే బాల‌య్య అభిమానుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Next Story