ప్ర‌భాస్ క‌ళ్ల‌ల్లో ఏదో తెలియ‌ని మ‌త్తు ఉంది : కృతి స‌న‌న్‌

Actor Prabhas has weird purity in his eyes says Actress Kriti Sanon.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ను ప్ర‌శంస‌ల వ‌ర్షంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2022 1:35 AM GMT
ప్ర‌భాస్ క‌ళ్ల‌ల్లో ఏదో తెలియ‌ని మ‌త్తు ఉంది : కృతి స‌న‌న్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ను ప్ర‌శంస‌ల వ‌ర్షంలో ముంచెత్తింది బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్‌. త‌న కెరీర్‌లో ఎంతో మంది హీరోల‌తో క‌లిసి ప‌ని చేశాన‌ని అయితే ప్ర‌భాస్ లాంటి ఉన్న‌త‌మైన, ఉదాత్త‌మైన వ్య‌క్తితం ఉన్న‌హీరోల‌ను చూడ‌లేద‌ని చెప్పుకొచ్చింది. ఇటీవ‌ల ఓ జాతీయ ప‌త్రిక‌కు కృతి స‌న‌న్ ఇంట‌ర్య్వూ ఇచ్చింది. ఇత‌ర హీరోల‌ కంటే భిన్నంగా ప్ర‌భాస్‌లో మీరు ఏం చూశారు అని అభిమాని ప్ర‌శ్నించాడు.

ఇందుకు కృతి ఇలా బ‌దులు ఇచ్చింది. "ప్ర‌భాస్‌తో క‌లిసి మ‌ళ్లీ ప‌ని చేయ‌డానికి నేను ఎంతో ఇష్ట‌ప‌డ‌తాను. ప్ర‌భాస్ వ్య‌క్తితం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. స‌హ న‌టుల నుంచి లైట్‌బాయ్ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రితోనూ విన‌మ్రంగా ఉంటారు. ఆయ‌న క‌ళ్ల‌ల్లో ఏదో తెలియ‌ని మ‌త్తు, ప్యూరిటీ ఉంది. క్లోజ్ షాట్స్‌లో నేను కొన్ని సీన్లు చూశాను. క‌ళ్ల‌తోనే అత‌డు మాయాజాలం చేయ‌గ‌ల‌డు. ఆ అనుభూతి నేను చెందా. అలాంటి ఎక్స్‌ప్రెసిస్ క‌ళ్లు క‌లిగిన అతికొద్ది మంది హీరోల్లో ప్ర‌భాస్ ఒక‌రు. వాటిని చూస్తున్న‌ప్పుడు నిజంగా ఓ మ‌త్తులోకి జారిపోతారు. ఆ క్వాలిటీయే అత‌డికి ఇత‌ర హీరోల కంటే చాలా భిన్నంగా మ‌లిచింది. ఇక రాముడి పాత్ర‌కు ప్ర‌భాస్ ప‌రిపూర్ణ న్యాయం చేశాడ‌ని" కృతి స‌న‌న్ చెప్పింది.

"ఆదిపురుష్" చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కృతి స‌న‌న్ న‌టించింది. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. రూ.500 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ఓం రౌత్ ద‌ర్శ‌కుడు. టి-సిరీస్ ఫిలిమ్స్ మరియు రెట్రోఫిల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయింది. ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ వ‌ర్క్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది(2023) సంక్రాంతి సంద‌ర్భంగా జ‌వ‌న‌రి 12 ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story