నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంభం: సీఎం
Karnataka schools to reopen till Class 10 from February 14. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని 10వ తరగతి వరకు అన్ని పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది. విద్యార్థులు రేపటి నుండి,
By అంజి Published on 14 Feb 2022 2:08 AM GMT
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని 10వ తరగతి వరకు అన్ని పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది. విద్యార్థులు రేపటి నుండి, అంటే ఫిబ్రవరి 14, 2022 (సోమవారం) నుండి తమ శారీరక తరగతులను కొనసాగించవచ్చు. నిన్న హుబ్లీలో జరిగిన సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కాకుండా, రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించిన తర్వాత పీయూసీ, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
కర్ణాటక పాఠశాలలు పునఃప్రారంభం: సీఎం అధికారిక ప్రకటన
''శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని డీసీలు, ఎస్పీలు, పాఠశాలల అడ్మినిస్ట్రేషన్లను ఆదేశించాను. పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఉన్నత తరగతుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు తిరిగి తెరవబడతాయి'' అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. తాజాగా గురువారం నాడు 9, 10 తరగతులను మాత్రమే పునఃప్రారంభిస్తున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత నెలకొన్న పరిస్థితులను పరిశీలించి నివేదిక సమర్పించాలని కర్ణాటక సీఎం రాష్ట్రంలోని విద్యాశాఖ మంత్రులను కూడా కోరారు.
Schools up to 10th standard will re-open from tomorrow. I've instructed the DCs, SPs and school administrations to conduct a peace committee meeting. Schools for higher classes and degree colleges will re-open after reviewing the situation: Karnataka CM Basavraj Bommai in Hubli pic.twitter.com/tpi3r0qc03
— ANI (@ANI) February 13, 2022