నేటి నుంచి ఇంటర్‌ కాలేజీలు రీఓపెన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.

By అంజి
Published on : 2 Jun 2025 7:42 AM IST

Inter colleges, colleges reopen, Inter Students

నేటి నుంచి ఇంటర్‌ కాలేజీలు రీఓపెన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇవాళే పాఠపుస్తకాల పంపిణీని మొదలుపెడతారు. కాగా ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి 23 వరకు ఇంటర్‌ క్లాసులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జూన్‌ 1 వరకు సెలవులు ఇచ్చారు.

అటు వేసవి సెలవుల ముగించుకుని తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 430 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. వాటికి మొత్తంగా 6,008 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. అందులో 5,234 మందే శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులు. అంటే ఇంకా 774 అధ్యాపక ఖాళీలున్నట్లు వెల్లడవుతోంది.

ఇదిలా ఉంటే.. 2025 - 26 విద్యా సంవత్సరంలో బీటెక్‌ ఫస్టియర్‌ క్లాసులను ఆగస్టు 14 లోపు ప్రారంభించాలని ఏఐసీటీఈ కాలేజీలను ఆదేశించింది. అనుమతుల కోసం యూనివర్సిటీలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి జూన్‌ 30 నాటికి ఉతర్వులు ఇస్తామంది. ఆయా వర్సిటీలు జులై 31 నాటికి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలంది. విద్యార్థులు సీట్లు రద్దు చేసుకోవడానికి ఆగస్టు 11 తుది గడువని పేర్కొంది. వారికి మొత్తం ఫీజు తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది.

Next Story