CBSE కొత్త ప్రయోగం.. ఇక పుస్తకాలు చూసి రాసే పరీక్షలు

సీబీఎస్‌ఈ అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

By Srikanth Gundamalla  Published on  23 Feb 2024 5:15 AM GMT
cbse, open book exams,  students,

 CBSE కొత్త ప్రయోగం.. ఇక పుస్తకాలు చూసి రాసే పరీక్షలు

సీబీఎస్‌ఈ అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పుస్తకాలను చూసి పరీక్షలు రాసే పద్ధతిని ఈ సంవత్సరం నవంబర్, డిసెంబర్‌ నెలల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లలో ఈ విధానాన్ని తీసుకురానున్నారు సీబీఎస్‌ఈ అధికారులు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఈ విధానం ద్వారా పరీక్షలు ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ అధికారులు వెల్లడించారు.

అయితే.. టెన్త్‌, 12వ తరగతి బోర్డు పరీక్షలకు మాత్రం ఈ ఓపెన్‌ బుక్‌ పరీక్షా పద్ధతిని ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని సీబీఎస్‌ఈ అధికారులు చెప్పారు. ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో... అలాగే 11, 12 తరగుత్లో అయితే ఇంగ్లీష్, మ్యాథ్స్, బయోలజీ సబ్జెక్టుల్లో ఓపెన్‌ బుక్‌ పరీక్షలను ప్రవేశపెట్టాలని చూస్తోంది సీబీఎస్‌ఈ. ఈ పద్ధతి ద్వారా పరీక్ష రాయడానికి ఎంత సమయం పడుతుందో అధికారులు గమనించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరిస్తారు. ఈ పరీక్షల కోసం ఓపెన్‌ బుక్‌ పద్ధతి ద్వారా విద్యార్థులు పాఠ్య గ్రంథాలను, అధ్యయన సామగ్రినీ వెంట తీసుకుపోవచ్చు. వాటిని చూస్తూనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.

అయితే.. పుస్తకాల్లో చూసి పరీక్ష రాయడం ద్వారా విద్యార్థుల సృజనాత్మకత, సమస్యా పరిష్కార శక్తి, తార్కిక ఆలోచనా పద్ధతిని బేరీజు వేస్తారు అధికారులు. 2014 నుంచి 2017 వరకు ఓపెన్‌ బుక్‌ పద్ధతితో ప్రయోగాలు చేశారు. వాటిపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా కళాశాలల్లో ప్రవేశం పొందాలంటే అడ్వాన్స్‌డ్‌ ప్లేస్‌మెంట్‌ పరీక్షలు రాయాలి. ఆ పరీక్షా పత్రాల్లో ఇచ్చే ప్రశ్నలు చాలా స్పష్టంగా ఉంటాయి. అయితే.. అడ్వాన్స్‌డ్‌ ప్లేస్‌మెంట్‌ ప్రశ్నలను పరిశీలించి ఓపెన్ బుక్‌ పరీక్షా పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రొఫెసర్లు సూచించారు.

Next Story