మృతదేహాలకు కరోనా పరీక్షలు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
By తోట వంశీ కుమార్ Published on 14 May 2020 9:21 AM GMTమృతదేహాలకు కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. గతంలో తెలంగాణ ప్రభుత్వం చనిపోయిన వారికి పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ ఉత్వర్వులను సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. టెస్టులు చేయకపోతే కరోనా విస్తరణలో మూడవ దశకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని చిక్కుడు ప్రభాకర్ తమ వాదనలు వినిపించారు. నెల్లూరు , కర్నూలు లో డాక్టర్లు చనిపోయిన తరువాత పరీక్షలు నిర్వహిస్తేనే కరోన భయటపడిందని పిటీషనర్ కోర్టుకు నివేదించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO ) తో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన గైడెలెన్స్ పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో.. నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 26 వరకు మరో స్ఫష్టమైన నివేదిక అందివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.