కర్నూలు: అవుకు రిజర్వాయర్ కాలువలోకి దివాకర్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. AP02TE5652 బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో డ్రైవర్లు, క్లినర్ సహా 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపింది దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం.