ఢిల్లీ అల్లర్లు: రంగంలోకి అజిత్ దోవల్
By అంజి Published on 26 Feb 2020 3:56 AM GMTఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్లో ఢిల్లీలోని తాజా పరిస్థితులపై సమీక్షించారు. ఆందోళనకారుల వివరాలను పోలీసుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మౌజ్పైర్, జఫరాబాద్, గోకుల్పురి, భజన్పూర్ ప్రాంతాల్లో దోవల్ తిరిగి.. అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. రాళ్ల దాడిలో 200 మందికిపైగా గాయాలు అయ్యాయి. నిరసనకారులు షాపులను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. మౌజ్పూర్, జాఫరాబాద్, కర్నాల్నగర్, చాంద్బాగ్లో సీఏఏ అల్లర్ల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఢిల్లీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు.
కాగా ఢిల్లీలో చెలరేగుతున్న హింసపై కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈశాన్య ఢిల్లీలో ఇవాళ పాఠశాలలకు మనీష్ సిసోడియా సెలవు ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన 10, 12 తరగతుల పరీక్షలను తూర్పు, ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో వాయిదా వేశారు.