నిర్భయ దోషులకు నాలుగోసారి ఉరిశిక్ష ఖరారు.. తేదీ ప్రకటించిన కోర్టు
By సుభాష్ Published on 5 March 2020 9:20 AM GMTనిర్భయ దోషులకు నాలుగో సారి డెత్ వారెంట్ జారీ అయింది. ఈనెల 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఢిల్లీ పటియాల హైస్ కోర్టు తీర్పునిచ్చింది. నలుగురు దోషులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తయ్యాయి. ఇప్పటికే మూడు సార్లు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు.. దోషుల వివిధ రకాల పిటిషన్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నాలుగో సారి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. మరి ఇప్పుడైనా ఉరి అమలు అవుతుందా..? లేదా? అనేది వేచి చూడాలి.
కాగా, 2012, డిసెంబర్ 16న ఓ విద్యార్థిపై కదులుతున్నబస్సులు ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చివరకు కన్నుమూసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు నిర్భయగా నామకరణం చేశారు.
ఈ ఘటనలో నిందితులైన, వినయ్, రామ్ సింగ్, అక్షయ్కుమార్, పవన్, ముఖేష్, మరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తీహార్ జైలుకు తరలించగా, 2013లో ఓ నిందితుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్గా భావించి మూడు సంతవ్సరాల పాటు జైలు శిక్ష విధించి విడుదల చేశారు. కేసు విచారించిన కోర్టు, కాగా మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది.