కొడుకులను చెరువులోకి తోసేసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు

By అంజి  Published on  9 May 2023 7:14 AM GMT
Khammam, suicide, Sathupalli

కొడుకులను చెరువులోకి తోసేసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన పాటిబండ్ల మృధుల (40), ప్రజ్ఞాన్ (8), మహన్ (5)గా గుర్తించారు. సోమవారం రాత్రి ఆ మహిళ తన పిల్లలతో కలిసి పట్టణానికి దూరంగా ఉన్న తామర చెరువులో దూకినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం తామర చెరువులో మూడు మృతదేహాలు బయటకు తేలాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులు, గజ ఈతగాళ్ల సాయంతో మృత దేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం వాటిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఖమ్మం ఎస్‌ఐ రాములు తెలిపారు. కుటుంబ కలహాలే కారణంగానే మృధుల ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. అయితే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఎవరైనా చంపేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి మరణానికి గల కారణాలపై కుటుంబ సభ్యులు, బంధువులను ఆరా తీస్తున్నారు.

Next Story