కాకినాడలో ఘోరం.. ఆయిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి
కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలుడులో ఇద్దరూ మరణించారు.
By అంజి Published on 2 April 2024 6:20 AM IST
కాకినాడలో ఘోరం.. ఆయిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి
కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలుడులో ఇద్దరూ మరణించారు. సంతానంపరవ మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన కొచ్చెర్ల ప్రభాకర్ (39) అనే లారీ డ్రైవర్, బూర సోమరాజు (39) అనే వెల్డింగ్ కార్మికుడు సోమవారం నాడు జరిగిన ఆయిల్ ట్యాంకర్ పేలుడులో మృతి చెందారు. ఈ ఘటన గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గొల్లప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ ఎ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. జి.గంగాధర్కు చెందిన ఖాళీ ఆయిల్ ట్యాంకర్ వెల్డింగ్ మరమ్మతులు చేస్తుండగా పవర్ఫుల్ పేలుడు సంభవించింది. వెల్డింగ్ ప్రక్రియలో అవశేష చమురు మండడం దీనికి కారణమని పరిశోధన సూచిస్తుంది. ట్యాంకర్ను సర్వీస్ సెంటర్లో శుభ్రం చేసినట్లు యజమాని చెబుతుండగా, ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు సమగ్ర విచారణ జరుగుతోందని ఇన్స్పెక్టర్ బాలాజీ తెలిపారు. పేలుడు తాకిడికి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు.