జగిత్యాలలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Tragedy in Jagtial.. Four members of the same family committed suicide. జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన స్వర్ణకారుడు ఆకోజు కృష్ణమూర్తి (42) తన భార్య శైలజ

By అంజి  Published on  15 Sep 2022 9:40 AM GMT
జగిత్యాలలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

జగిత్యాలలో విషాదం చోటు చేసుకుంది. ఆగస్టు 20న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన స్వర్ణకారుడు ఆకోజు కృష్ణమూర్తి (42) తన భార్య శైలజ (35), కుమార్తె గాయత్రాయ్ (13), కుమారుడు అశ్రిత్ (15)తో సహా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 20న రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇరుగుపొరుగు వారు జగిత్యాల ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

కృష్ణమూర్తి చికిత్స పొందుతూ ఆగస్టు 24న మృతి చెందగా, ఆయన కుమార్తె గాయత్రాయ్‌ సెప్టెంబర్‌ 5న, కుమారుడు అశ్రిత సెప్టెంబర్‌ 13న తుదిశ్వాస విడిచారు. గురువారం వరకు నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన శైలజ ఉదయం తుదిశ్వాస విడిచారు. జగిత్యాలలో నగల దుకాణం నిర్వహిస్తున్న కృష్ణమూర్తి వ్యాపారం సరిగా లేకపోవడంతో అప్పుల పాలయ్యాడు. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పులు తీర్చలేక కృష్ణమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కుటుంబం మొత్తం మృతి చెందడంతో కృష్ణానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story