ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. 10వ తరగతి విద్యార్థి జననాంగాలపై దాడి

Tenth class student brutally attacked on genitals by fellow students in chennai. చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థిని తోటి విద్యార్థులు అర్ధనగ్నంగా

By అంజి  Published on  24 Nov 2022 11:37 AM GMT
ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. 10వ తరగతి విద్యార్థి జననాంగాలపై దాడి

చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థిని తోటి విద్యార్థులు అర్ధనగ్నంగా ర్యాగింగ్‌ చేశారు. ఆ తర్వాత విద్యార్థి జననాంగాలపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శాంసన్ (పేరు మార్చాం) పుదుచ్చేరికి చెందినవాడు. భవన నిర్మాణ వ్యాపారం చేస్తున్న అతడు నాలుగు నెలల క్రితం కుటుంబంతో సహా చెన్నైలోని ఎంజీఆర్ నగర్ ప్రాంతానికి వెళ్లాడు. అతని 15 ఏళ్ల కుమారుడు అదే ప్రాంతంలోని కేంద్ర ప్రభుత్వ పాఠశాల (కేంద్రీయ విద్యాలయం)లో 10వ తరగతి చదువుతున్నాడు.

తన స్వస్థలమైన పుదుచ్చేరిలో చదువుతున్న బాలుడు 4 నెలల క్రితం ఈ పాఠశాలలో చేరాడు. స్కూల్లో తోటి విద్యార్థులు తన భాష గురించి, తండ్రి వృత్తి గురించి ఆటపట్టించారని తెలుస్తోంది. దీంతో బాలుడికి, తోటి విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తోటి విద్యార్థులు అతనిపై దాడి చేశారు. ఈ విషయాన్ని బాలుడు తన తండ్రికి చెప్పాడు. దీంతో అతని తండ్రి ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశాడు. దీనిపై ఉపాధ్యాయులు విచారణ నిర్వహించి బాలుడిపై దాడి చేసిన తోటి విద్యార్థులను మందలించి హెచ్చరించారు.

ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన 15 మందికి పైగా విద్యార్థులు నవంబర్ 21న పాఠశాల ముగించుకుని బయటకు వచ్చిన బాలుడిపై దాడి చేసి అర్ధనగ్నంగా చేశారు. తన ప్రైవేట్ పార్ట్‌లను కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. దీంతో బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు కిల్పాక్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పాఠశాలలో జరిగిన వేధింపుల గురించి బాలుడు తల్లిదండ్రులకు తెలియజేయడంతో, బాలుడి తండ్రి శాంసన్ చెన్నై కెకె నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాలుడిపై అత్యాచారం చేసి లైంగికంగా వేధించిన తోటి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story