ఆమె జాతకంలో మంగళ దోషం ఉంది.. అందుకే రాజాను బలి తీసుకుంది

రాజా రఘువంశీ మర్డర్ మిస్టరీ విన్న తర్వాత అందరి మదిలో ఒక్కటే ప్రశ్న సోనమ్ రాజుని ఎందుకు హత్య చేసింది?

By Medi Samrat
Published on : 11 Jun 2025 3:19 PM IST

ఆమె జాతకంలో మంగళ దోషం ఉంది.. అందుకే రాజాను బలి తీసుకుంది

రాజా రఘువంశీ మర్డర్ మిస్టరీ విన్న తర్వాత అందరి మదిలో ఒక్కటే ప్రశ్న సోనమ్ రాజుని ఎందుకు హత్య చేసింది? సోనమ్ తన భర్త రాజా రఘువంశీతో కలిసి జీవించడానికి ఇష్టపడకపోతే.. ఆమె రాజ్ కుశ్వాహాను ప్రేమించివుంటే.. ఆమె ఇంటిని వ‌దిలి వెళ్ల‌కుండా.. రాజా రఘువంశీ హత్యకు ఎందుకు కుట్ర చేసింది.? దీనిపై రాజా రఘువంశీ తల్లి షాకింగ్ వివ‌రాలు వెల్లడించింది.

సోనమ్ కుటుంబం తంత్ర విద్య‌లు నమ్ముతుందని రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ చెప్పారు. పెళ్లి తర్వాత నా కొడుకును కామాఖ్యా దేవి గుడికి తీసుకెళ్లమని సోనమ్ కోరింది.సోనమ్‌కి మంగళ్ దోష్ ఉందని, దానిని తొలగించేందుకు ఆమె రాజాను బలితీసుకుందని రాజా తల్లి ఉమా రఘువంశీ ఆరోపించారు.

రాజా తల్లి ప్రకారం.. "కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించిన తర్వాతే కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తానని సోనమ్ రాజాతో చెప్పింది.. రాజా మృతదేహం దొరికిన తర్వాత.. సోనమ్ తప్పిపోయింద‌ని వెతుకుతున్న‌ప్పుడు.. ఆమె కుటుంబ సభ్యులు ఒక తాంత్రికుడిని సంప్రదించారు. తాంత్రికుడి అభ్యర్థన మేరకు సోనమ్ గురించి ఆధారాలు కనుగొనడానికి వారి కుమార్తె ఫోటోను తలక్రిందులుగా ఇంటి తలుపుకు వేలాడదీశారు.

రాజా, సోనమ్ ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారని రాజా తల్లి చెప్పారు. ఆ సమయంలో సోనమ్ కుటుంబ సభ్యులు ఆమెపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. త్వరలో పెళ్లి చేద్దామనుకున్నాం కానీ పండిట్ ని అడిగి వెంట‌నే పెళ్లికి డేట్ ఫిక్స్ చేశార‌ని పేర్కొన్నారు.

సోనమ్ జాతకంలో మంగళ దోషం ఉందని రాజా రఘువంశీ తండ్రి పేర్కొన్నారు. అందుకే సోనమ్ తన నుండి మంగళ్ దోష్‌ను తొలగించడానికి రాజాను వివాహం చేసుకుని, ఆపై అతన్ని హత్య చేసి ఉండవచ్చని పేర్కొన్నారు.

Next Story