కూతురిని చంపి.. కత్తితో నరాలు కోసుకున్న తల్లి

మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ తల్లి తన 11 ఏళ్ల కూతురిని హత్య చేసిన ఘటన ముంబైలోని బోరివలి ప్రాంతంలో చోటుచేసుకుంది.

By అంజి  Published on  17 Feb 2024 6:47 AM GMT
Mentally ill, suicide, Mumbai, Borivali, Murder

కూతురిని చంపి.. కత్తితో నరాలు కోసుకున్న తల్లి

మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ తల్లి తన 11 ఏళ్ల కూతురిని హత్య చేసిన ఘటన ముంబైలోని బోరివలి ప్రాంతంలో చోటుచేసుకుంది. హత్య అనంతరం పదేళ్లుగా మానసిక వ్యాధులకు మందులు వాడుతోన్న ఆ తల్లి.. కత్తితో నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసి ఉన్న గదిలో కూతురిని తల్లి గొంతుకోసి చంపింది. తల్లీ, కూతురిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, కూతురు చనిపోయిందని ప్రకటించారు. తల్లి చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఆమె భర్త కస్తూర్బా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. నిందితురాలు, ఆమె భర్త వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు.

కొన్నేళ్లుగా మానసిక చికిత్స పొందుతున్న బోరివాలికి చెందిన 42 ఏళ్ల మహిళ గురువారం తన 11 ఏళ్ల కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యకు ప్రయత్నించింది. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె భర్త, కూతురు మందులు వేసేందుకు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం శతాబ్ది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి డిశ్చార్జి కాగానే అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ఆ మహిళ రక్తం ఎక్కువగా పోవడంతో ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతోంది. ఆమెపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేయబడింది. ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉంది.

Next Story