Jangaon: భూ వివాదంలో ఆర్టీఐ కార్యకర్త హత్య.. పట్టుబడిన ముగ్గురిలో బీఆర్‌ఎస్‌ నాయకురాలి భర్త

భూ వివాదంపై జనగాం జిల్లాలో సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త హత్యకు గురయ్యాడు. రిటైర్డ్‌ మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ అధికారి

By అంజి  Published on  20 Jun 2023 6:01 AM GMT
Jangaon, RTI activist, land dispute, BRS leader husband

Jangaon: భూ వివాదంలో ఆర్టీఐ కార్యకర్త హత్య.. పట్టుబడిన ముగ్గురిలో బీఆర్‌ఎస్‌ నాయకురాలి భర్త

తెలంగాణ: భూ వివాదంపై జనగాం జిల్లాలో సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త హత్యకు గురయ్యాడు. రిటైర్డ్‌ మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ అధికారి(ఎంపీడీఓ)ని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 70 ఏళ్ల నల్లా రామకృష్ణయ్య అదృశ్యమైన మూడు రోజుల తర్వాత అతని మృతదేహం నీళ్లతో నిండిన క్వారీలో ఆదివారం కనుగొనడంతో హత్య వెలుగులోకి వచ్చింది. దీనికి ముందు, బాధితురాలి కుమారుడు మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు.

''ప్రధాన నిందితుడైన జి అంజయ్యకు రామకృష్ణయ్యతో వివాదం ఉంది. భూమి సమస్యపై ప్రభుత్వ అధికారులకు నివేదించినందుకు అతనిపై పగ పెంచుకున్నాడు. రామకృష్ణయ్యను హతమార్చేందుకు అంజయ్య కాంట్రాక్ట్‌ కిల్లింగ్‌ ముఠాను నియమించుకున్నాడు'' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. జూన్ 15న పోచన్నపేటలో రామకృష్ణయ్యను ఈ ముఠా కిడ్నాప్ చేసినట్లు సమాచారం. టవల్‌తో గొంతుకోసి హత్య చేసి, మృతదేహాన్ని క్వారీ చెరువులో పడేశారు.

జూన్ 18న ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లతో పాటు ప్రధాన నిందితుడైన జి అంజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ''రామకృష్ణయ్య ఆర్టీఐ దరఖాస్తులు, కోర్టులో సివిల్ దావాలు దాఖలు చేశాడు. పోచన్నపేట గ్రామంలో అంజయ్య ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఆక్రమించాడని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో వారి మధ్య వ్యక్తిగత శత్రుత్వం ఏర్పడి, మాజీ ఎంపీడీఓను హత్య చేసేందుకు అంజయ్య ముఠాను నియమించుకున్నాడు'' అని పోలీసులు తెలిపారు.

అధికార బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్థానిక జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) సభ్యురాలి భర్త జి అంజయ్య తిరుపతిని సంప్రదించి రామకృష్ణయ్యను అంతమొందించేందుకు రూ.8 లక్షలు ఆఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. "తిరుపతి ఈ హత్య చేయడానికి అంగీకరించాడు. అంజయ్య నుండి రూ. 50,000 అడ్వాన్స్ తీసుకున్నాడు" అని పోలీసులు తెలిపారు.

Next Story