హైదరాబాద్‌లో దారుణం.. కిడ్నాప్‌ చేసి బాలికపై అత్యాచారం

రోజుకురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  7 Dec 2023 4:52 AM GMT
hyderabad, sanathnagar, girl, kidnapped,  rape,

హైదరాబాద్‌లో దారుణం.. కిడ్నాప్‌ చేసి బాలికపై అత్యాచారం

రోజుకురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లలు అని కూడా చూడకుండా కామాంధులు దారుణాలకు ఒడిగడుతున్నారు. కొన్ని సంఘటనల్లో పాపలు ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులు అనుకున్నవారే జీవితాలను చెరిపేస్తున్నారు. అయితే.. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఇలాంటి దారుణ సంఘటనే జరిగింది. మోతీనగర్‌కు చెందిన ఓ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.

మధురానగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్‌ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక అక్కడ తమ కుటంబంతో కలిసి నివాసం ఉంటోంది. దగ్గరలో ఉన్న ఓ కాలేజ్‌లో ఇంటర్‌ చదువుతోంది. కాగా.. బాలికకు ఒక అక్క కూడా ఉండేది. అయితే.. ఆమె ఫిబ్రవరిలో సాయి అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇంటికి దూరంగానే ఉంటోంది. సాయికి స్నేహితుడు బాలికపై కన్నేశాడు. నవంబర్‌ 25న ఉదయం బాలిక ఇంటి నుంచి పాల ప్యాకెట్‌ కోసం కిరాణ దుకాణానికి వెళ్లింది. ఆ సమయంలోనే ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు సాయి స్నేహితుడు ప్లాన్‌ చేసుకున్నాడు.

మరో ఇద్దరితో కలిసి నిందితుడు కారులో వెయిట్‌ చేశాడు. బాలిక పాల ప్యాకెట్‌ కోసం రాగానే ఈల వేసి కారుని పిలిచాడు. వెంటనే బాలికను కిడ్నాప్‌ చేసి బొబ్బుగూడ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడే కారుని ఆపి బాలికపై బావ మితుడైన కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో వ్యక్తి కూడా అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులతో తెలిపింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ అక్కడను చంపేస్తామంటూ బాలికను బెదిరించారు. బాధితులు జరిగిన ఘోరాన్ని తండ్రితో చెప్పలేకపోయింది. తల్లి గుంటూరులో ఉంది. తండ్రితో కలిసి అక్కడికి వెళ్లిన బాలిక.. తన తల్లితో జరిగిన ఘోరాన్ని చెప్పుకుంది. ఈ నెల 5న మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ దారుణ సంఘటనపై కేసు నమోదు చేశారు. నేరం జరిగిన ప్రదేశం సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోది కావడంతో.. అక్కడికి కేసును బదిలీ చేశారు. బాధితురాలు ఇచ్చిన వివరాల మేరకు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Next Story