హైదరాబాద్: యూసుఫ్గూడలో చిన్న అప్పు కారణంగా బహిరంగంగా అవమానించబడి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా రాఘవాపూర్కు చెందిన భూక్య బాలాజీ (28) తన భార్య మానసతో కలిసి జవహర్నగర్లో నివసిస్తున్నాడు. అతని స్వస్థలానికి చెందిన మరో జంట సైదులు, దుర్గ కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం బాలాజీ దుర్గకు వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చాడు.
సెప్టెంబర్ 17న, అతను ఆ జంటను మార్కెట్లో కలిసి డబ్బు తిరిగి ఇవ్వమని అడిగాడు. దీంతో ఆగ్రహించిన ఆ జంట అతన్ని తిట్టారు. దుర్గ బాలాజీని తన చెప్పుతో బహిరంగంగా కొట్టింది. తీవ్ర అవమానానికి గురైన బాలాజీ ఇంటికి వెళ్లి గురువారం తన భార్య ఇంట్లో లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మానస తిరిగి వచ్చేసరికి తలుపుకు లోపలి నుండి గడియ పెట్టి ఉంది. కిటికీలోంచి చూడగా, బాలాజీ లోపల ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.