విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య

గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. సూరత్‌లోని ఓ కుటుంబం మొత్తం ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  28 Oct 2023 3:30 PM GMT
gujarat, mass suicide, seven dead,  family,

విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య

గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. సూరత్‌లోని ఓ కుటుంబం మొత్తం ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబంలోని మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సూరత్‌కు చెందిన ఒక వ్యాపారి తన తల్లిదండ్రులతో పాటు భార్య, ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తానూ సూసైడ్‌ చేసుకున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలోనే కలకలం రేపుతోంది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.

సూరత్‌లోని పాలన్ పూర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో ఫర్నీచర్‌ వ్యాపారి మనీష్‌ సోలంకి కుటుంబం నివసిస్తోంది. మనీష్‌తో పాటు అతని తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. మనీశ్‌ తన పిల్లలు, తల్లిదండ్రులు, భార్యకు విషం ఇచ్చి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం మనీష్‌ సహోద్యోగి అతడికి ఫోన్‌ చేశాడు. ఎంతకీ లిఫ్ట్‌ చేయకపోవడంతో ఇంటికి వచ్చాడు. అక్కడికి వెళ్లి తలుపులను కొట్టినా ఎంతకీ తీయలేదు. దాంతో.. అనుమానం వచ్చిన అతను వెనుక డోర్‌ చూసేందుకు ప్రయత్నించాడు.

అక్కడ అన్ని డోర్లూ క్లోజ్‌ చేసి ఉన్నాయి. దాంతో.. కిటికీ అద్దాన్ని ధ్వంసం చేసి ఇంట్లోకి వెళ్లాడు. ఏడుగురు సూసైడ్‌ చేసుకుని ఉండటాన్ని చూసి షాక్‌ తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో.. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్ని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్టన్నట్లు తెలుస్తోంది. తులను మనీష్ సోలంకి(35) అతని భార్య రీటా(32), ముగ్గురు పిల్లలు, మనీష్ తల్లిదండ్రులు కాంతిలాల్(65), శోభన(60) గా గుర్తించారు. కేసు నమోదు చేశామని.. విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడం.. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతోనే మనీశ్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

Next Story