Vijayawada: దెయ్యమై వేధిస్తానని యువతి సూసైడ్ అటెంప్ట్

మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  29 Aug 2023 12:30 PM GMT
Girl, Suicide attempt, Vijayawada, Crime, Police,

 Vijayawada: దెయ్యమై వేధిస్తానని యువతి సూసైడ్ అటెంప్ట్

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎగ్జామ్స్‌లో తప్పామని.. మార్కులు తక్కువవగా వచ్చాయంటూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుని.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. అంతేకాదు.. ఎక్కువ శాతం యువత ప్రేమలో విఫలం అయ్యామంటూ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. విజయవాడలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇంటర్‌ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ప్రేమలో విఫలం అయ్యానని.. ఆత్మహత్యాయత్నం చేసింది. కాలేజ్‌ భవనం పైనుంచి దూకి సూసైడ్ అటెంప్ట్‌ చేసింది.

విజయవాడ అంబాపురంలో ఓ కాలేజీలో యువతి ఇంటర్మీడియట్‌ సెకండియర్ చదువుతోంది. క్లాస్‌ టాపర్‌ కూడా. కూతురు బాగా చదువుతుంది అని.. జీవితంలో మంచి పొజిషన్‌కి వెళ్తుందని తల్లిదండ్రులు, బంధువులంతా భావించారు. కానీ.. వారి కలలను కూడా ఆ యువతి కలలుగానే మిగిల్చినంత పని చేసింది. సదురు యువతికి తన ఇంటి పక్కనే ఉన్న అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమ వరకు దారితీసింది. కానీ.. యువకుడు మరో అమ్మాయితో మాట్లాడటం గమనించింది. తర్వాత వివరాలు ఆరా తీయగా అతడు మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నట్లు తెలుసుకుంది. ప్రేమలో మోస పోయానని తెలుసుకున్న యువతి.. కుంగిపోయింది. ఎంతో బాధపడింది. ఆ తర్వాత కాలేజీకి కూడా వెళ్లడం మానేసింది. కొన్నాళ్లు ఇంట్లోనే మూడీగా ఉండిపోయింది.

కొద్దిరోజుల తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లింది. అంతాబానే ఉంది కదా అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ.. కాలేజ్‌కి వెళ్లిన యువతి నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న స్థానికులు అది గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిందని.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాలేజీ యాజమాన్యం సమాచారం మేరకు తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి వద్దకు వెళ్లారు. కూతురు ఆత్మహత్యాయత్నం చేయడం.. పరిస్థితి విషమంగా ఉండటంతో వాళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా.. ఈ ఘటనలో యువతి బ్యాగులో సూసైడ్‌ నోట్‌ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. 11 పేజీల సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రేమలో విఫలం అయ్యాయనని.. తాను ప్రేమించిన యువకుడు మరో యువతిని ప్రేమిస్తున్నాడని రాసుకొచ్చింది. తనకు చదువుపై ఇంట్రెస్ట్ పోయిందని.. తన తప్పు లేకపోయినా అందరూ తననే నిందిస్తున్నారంటూ లేఖలో వాపోయింది. అయితే.. తనని ఇబ్బంది పెట్టినవారిని చనిపోయాక దెయ్యమై పీడిస్తానంటూ లేఖలో హెచ్చరించింది. ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story