జాత‌ర‌లో అంద‌రూ చూస్తుండ‌గానే అల్లుడిని చంపిన మామ‌

క‌ర్నూలు జిల్లాలో జాత‌ర‌కు వ‌చ్చిన అల్లుడిని అంద‌రూ చూస్తుండనే దారుణంగా హ‌త‌మార్చాడు మామ‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2023 5:12 AM GMT
Kurnool, Kurnool Crime news

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

మ‌నిషి ప్రాణం అంటే విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న కార‌ణాల‌కే ప‌గ‌లు పెంచుకుని ముందు వెనుకా ఆలోచించ‌కుండా దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. అయిన‌వారిని క‌డ‌తేరుస్తున్నారు. జాత‌ర‌కు వ‌చ్చిన అల్లుడిని అంద‌రూ చూస్తుండనే దారుణంగా హ‌త‌మార్చాడు మామ‌. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో జ‌రిగింది.

దేవ‌న‌కొండ మండలం పి.కోటకొండలో లింగ‌మ‌య్య త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. త‌న కూతురిని సూర్య‌ప్ర‌కాశ్(23) అనే యువ‌కుడికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే.. కొంత‌కాలంగా సూర్య‌ప్ర‌కాశ్ త‌న కూతురిని వేధిస్తున్నాడు అని తెలుసుకున్న లింగ‌మ‌య్య అల్లుడిపై ర‌గిలిపోయేవాడు. ఎలాగైనా స‌రే సూర్య‌ప్ర‌కాశ్‌ను చంపాల‌ని లింగ‌మ‌య్య బావించాడు. అందుకు అనువైన స‌మ‌యం కోసం వేచి చూస్తున్నాడు.

గ్రామంలో జాత‌ర జ‌రుగుతుండ‌డంతో కోలాహ‌లంగా ఉంది. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

జాత‌ర‌కు సూర్య ప్ర‌కాశ్ వ‌చ్చాడు. ముంద‌స్తుగా వేసుకున్న ప‌థ‌కం ప్ర‌కారం లింగ‌మ‌య్య క‌త్తితో అంద‌రూ చూస్తుండ‌గానే సూర్య‌ప్ర‌కాశ్ పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి హ‌త‌మార్చాడు.

తీవ్రంగా గాయ‌ప‌డిన సూర్య‌ప్ర‌కాశ్ ఘ‌ట‌నాస్థ‌లంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

Next Story