భూదాన్ పోచంపల్లిలో విషాదం

Child Died After swallowing Five Rupees Coin in Bhoodan Pochampally.చిన్న పిల్ల‌లు ఉన్న త‌ల్లిదండ్రులు ఎంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2022 9:39 AM GMT
భూదాన్ పోచంపల్లిలో విషాదం

చిన్న పిల్ల‌లు ఉన్న త‌ల్లిదండ్రులు ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప‌నుల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ చిన్నారులు ఏం చేస్తున్నారు అనే విష‌యాన్ని ఓ కంట క‌నిపెడుతూ ఉండాలి. లేదంటే కొన్ని సార్లు చిన్నారులు ప్ర‌మాదాల్లో ప‌డుతుంటారు. ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కూడా పోవ‌చ్చు. ఓ చిన్నారి ఆడుకుంటూ ఐదు రూపాయ‌ల నాణెన్ని మింగింది. దీంతో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘ‌ట‌న యాద్రాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. భూదాన్‌ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీలో బొంగు మహేశ్, సరిత దంపతులు నివ‌సిస్తున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారైలు సంతానం. చిన్న కుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటి ద‌గ్గ‌ర ఆడుకుంటూ ఐదు రూపాయ‌ల నాణేన్ని మింగేసింది. అది గొంతులో ఇరుక్కుపోయింది. వెంట‌నే చెత్ర‌ను హైద‌రాబాద్‌లోని ఓప్రైవేటు ఆస్ప‌త్రికి తీసుకువెళ్ల‌గా.. డాక్టర్లు చికిత్స చేసి నాణాన్ని తీసేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే.. స‌డెన్‌గా చిన్నారి సోమ‌వారం అస్వ‌స్థ‌త‌కు గురైంది. దీంతో మ‌రోసారి అదే ఆస్ప‌త్రికి తీసుకువెలుతుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే ప్రాణాలు కోల్పోయింది. కాయిన్ ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్ సోకి చిన్నారి మరణించి ఉంటుంద‌ని స్థానికులు చెబుతున్నారు. చిన్నారి మృతి చెంద‌డంతో పాప త‌ల్లిదండ్రుల రోద‌న‌ను ఆప‌డం అక్క‌డ ఉన్న ఎవ్వ‌రిత‌రం కాలేదు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా విషాదం అలుముకుంది.

Next Story