15 అడుగుల సొరంగం తవ్వి చోరీకి యత్నం.. చివరికి క్షమించండంటూ నోట్‌

Burglars who dug 15-foot tunnel leave note in Meerut jewellery store. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గల ఓ నగల దుకాణంలోకి నలుగురు వ్యక్తులు 15 అడుగుల సొరంగం

By అంజి  Published on  3 Feb 2023 4:58 AM GMT
15 అడుగుల సొరంగం తవ్వి చోరీకి యత్నం.. చివరికి క్షమించండంటూ నోట్‌

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గల ఓ నగల దుకాణంలోకి నలుగురు వ్యక్తులు 15 అడుగుల సొరంగం తవ్వి చొరబడ్డారు. అయితే వారికి అక్కడ ఏమీ దొరక్కపోవడంతో క్షమించమని చెబుతూ ఓ నోట్‌ రాసి వదలి వెళ్లారు. దీపక్‌కు చెందిన నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించారు. షాపు యజమాని గురువారం తన షోరూమ్ షట్టర్‌లు ఎత్తి చూడగా లోపల లోతైన రంధ్రం కనిపించింది. దుకాణం వెలుపల ఉన్న డ్రైనేజీ కాలువ నుండి దొంగలు చెక్కిన సొరంగం నేరుగా దుకాణం లోపలికి దారితీసింది. తమ గుర్తింపును దాచుకునేందుకు దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.

వారు ఖజానాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు, కానీ విఫలమవడంతో వారు యజమాని కోసం ఒక చీటీని వదిలి అక్కడి నుండి పారిపోయారు. నలుగురు వ్యక్తులు పేరు ప్రఖ్యాతులు పొందేందుకు దుకాణాన్ని దోచుకోవడానికి ప్రయత్నించారని, కానీ, అలా చేయడంలో విఫలమైనందున, క్షమాపణలు చెబుతున్నారని నోట్ పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఆభరణాల దుకాణంలో ఉంచిన కృష్ణుడి విగ్రహం, సీసీటీవీ రికార్డింగ్‌లు, వెండి వేణువును ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసి 'సారీ' దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story