బెంగ‌ళూరులో భార్గ‌వరామ్‌.. ఏ2 నుంచి ఏ1గా అఖిల ప్రియ‌

Akhilapriya husband Bhargav Ram in Bengaluru.బోయినపల్లి కిడ్నాప్ కేసులో నిందితుడైన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గ‌వరామ్‌ బెంగ‌ళూరులో, ఏ2 నుంచి ఏ1గా అఖిల ప్రియ.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2021 4:41 AM GMT
Akilha Priya husband Bhargav Ram

బోయినపల్లి కిడ్నాప్ కేసులో నిందితుడైన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ బెంగళూరులో ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. హైద‌రాబాద్‌లోని రూ.కోట్ల విలువైన భూవివాదంలో ముగ్గురి కిడ్నాప్‌కు ప‌థ‌కం రచించ‌డంతో పాటు వారిని అప‌హ‌రించ‌డం కోసం గుంటూరు, క‌ర్నూలు జిల్లాల‌కు చెందిన 15 మందిని భార్గ‌వ‌రామ్ ర‌ప్పించిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. కిడ్నాప్ అనంత‌రం నిందితులు పోలీసులకు దొరక్కుండా టోల్‌ప్లాజాలు లేని సర్వీస్‌ రోడ్లను ఎంచుకుని బెంగళూరు వైపు పారిపోయారు.వారి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి. కాగా, కిడ్నాప్‌నకు పథకం రచించిన భార్గవ్‌రామ్‌కు నేర చరిత్ర ఉందని, పలు ఆర్థిక నేరాల్లో ఆయన పాత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. సెటిల్‌మెంట్ల‌కు పాల్ప‌డుతున్న భార్గ‌వ‌రామ్.. భాధితుల‌ను భౌతికంగా, ఆర్థికంగా దెబ్బ‌తీసేందుకు కూడా వెన‌కాడ‌బోడ‌ని నివేదిక‌లో వివ‌రించారు.

ఇదిలా ఉంటే.. కిడ్నాప్ కేసు అనుకోని మలుపులు తిరుగుతోంది. మొన్న సాయంత్రం వరకు ఈ కేసులో ఎ2 నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను నిన్న ఏ1గా మార్చారు. ఎ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా మార్చారు. సుబ్బారెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదని, పాత కేసు నేపథ్యంలో ఆయనను అనుమానించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అందుకనే నోటీసులు ఇచ్చి పంపించేసినట్టు చెప్పారు.



Next Story