ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు దుర్మరణం

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

By Srikanth Gundamalla  Published on  8 July 2023 2:21 AM GMT
Adilabad, Accident, 4 Dead, Auto,

ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు దుర్మరణం

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం ఉదయమే ఈ సంఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

గుడిహత్నూర్ మండలం మేకలగండి దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్‌ జిల్లా వాసులుగా గుర్తించారు పోలీసులు. వారికి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డుప్రమాద ఘటనపై కేసు నమోదు చేశారు. ఆటోను ఢీకొట్టిన వాహనం గురించి ఆరా తీస్తున్నారు.

Next Story