దిశ కేసు.. వెలుగులోకి కీలక ఆధారం..!

By అంజి  Published on  10 Dec 2019 2:29 AM GMT
దిశ కేసు.. వెలుగులోకి కీలక ఆధారం..!

హైదరాబాద్‌: శంషాబాద్‌లో దిశ హత్య ఘటనతో యావత్‌ దేశం కదిలింది. మహిళలు, ప్రజలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దిశను నిందితులు రాత్రి 10.28 గంటల సమయంలో లారీలో తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు. లారీ వెళ్తున్న దృశ్యాలు తొండూపల్లి టోల్‌గేట్‌ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు ఈ వీడియో ఆధారంగానే నిందితులను గుర్తించారు. చటాన్‌పల్లి బ్రిడ్జి కింది దిశను పాశవికంగా హత్య చేశారు. దిశ హత్యకు గురైన స్థలంలోనే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

కాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో నేడు సిట్‌ బృందం విచారణ చేపట్టనుంది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ నేతృత్వంలోని బృందం ఘటనా స్థలంలో వివరాలు సేకరించనున్నారు.

Next Story