రూ.50 లక్షల విరాళమిచ్చిన క్రికెట్ దిగ్గజం

By రాణి  Published on  27 March 2020 8:46 AM GMT
రూ.50 లక్షల విరాళమిచ్చిన క్రికెట్ దిగ్గజం

కరోనా నివారణ చర్యల కోసం దేశ వ్యాప్తంగా సినీ తారలు, వ్యాపారస్తులు, స్పోర్ట్స్ స్టార్స్ తమవంతు విరాళాలను కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేస్తున్నారు. షట్లర్ పీవీ సింధు ఇటీవలే రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తనవంతు సాయమందించేందుకు ముందుకొచ్చారు. ప్రధాని సహాయ నిధికి రూ.25 లక్షలు, మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళమిస్తున్నట్లు తెలిపారు.

Also Read : మూడు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన బన్నీ

మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా కూడా తన వంతు సాయంగా మూడు నెలల జీతంతో పాటుగా..బీసీసీఐ ఇస్తున్న పింఛన్ ను కూడా విరాళంగా ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇక సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా రూ.21 లక్షలు ప్రధాని సహాయనిధికి, మరో రూ.21 లక్షలు గుజరాత్ సీఎం సహాయనిధికి అందజేయనున్నట్లు తెలిపింది.

Also Read :లాక్ డౌన్ అయిన వేళ..భారీ విరాళాలిచ్చిన సెలబ్రిటీలు

Next Story