ఏనుగు ఘటన తర్వాత మరో దారుణం: గర్భంతో ఉన్న ఆవు నోట్లో బాంబు పెట్టి..

By సుభాష్  Published on  6 Jun 2020 10:27 AM GMT
ఏనుగు ఘటన తర్వాత మరో దారుణం: గర్భంతో ఉన్న ఆవు నోట్లో బాంబు పెట్టి..

కేరళలోని పాలక్కడ్‌ జిల్లా మలప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు పేలుడు పదార్థాలతో కూడిన కొబ్బరి కాయ తినడంతో ఏనుగు మరణించిన విషయం తెలిసిందే. ముందుగా ఫైనాపిల్‌ పిండు అనుకున్నా.. అది కాదు.. కొబ్బరికాయ అని అటవీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏనుగును చంపిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్‌ చేశారు. అయితే ఈ ఘటన మర్చిపోక ముందే అలాంటి దారుణం ఓ ఆవుకు జరిగింది. గర్భంతో ఉన్న ఓ ఆవు నోట్లో బాంబు పేలింది. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ వైరల్‌గా మారింది. బాంబు పేలుడు వల్ల ఆవు దవడలు పగిలిపోయాయి. నోటీ నుంచి తీవ్ర రక్తస్రావం అయ్యింది. కాగా, ఆవు యజమాని గురుదయాళ్‌ సింగ్‌ తనకు న్యాయం చేయాలని, ఈ దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు.

తన ఇంటి పక్కనే ఉన్న నందలాల్‌ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు ఆయన ఆరోపించాడు. ఆవుకు ఏదో పేలుడు పదార్థం తినిపించడం వల్ల తీవ్రంగా గాయపడినట్లు చెప్పాడు. ఈ ఘటన జరిగిన తర్వాత నందలాల్‌ పరారైనట్లు తెలిపాడు. పది రోజుల కిందట ఆవుపై ఈ ఘటన జరిగిందని, కనీసం ఏమి కూడా తినడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది చదవండి: ఆ ఏనుగు తిన్నది ఫైనాఫిల్ కాదట..

ఇలా మూగ జీవాలపై ఇలాంటి దారుణాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి మానవమృగాళ్లు మనుషులపైనే కాకుండా జంతువులపై కూడా ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.



Next Story