కన్నా నిద్రపోతున్నారా.? జీవీఎల్ నోరు పడిపోయిందా.? : సీపీఐ రామకృష్ణ
By న్యూస్మీటర్ తెలుగు Published on
25 Sep 2019 10:39 AM GMT

ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. గతంలో చంద్రబాబు అడిగితే నిధులు ఇవ్వలేదని.. ఇప్పుడు జగన్ అడిగే పరిస్థితే లేదని ఆయన ఫైర్ అయ్యారు. రైల్వే జోన్ ను గాలికొదిలేశారని.. రాజధాని నిధులపై వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తోందని.. ఏపీలో మాట్లాడేవారు లేరనేది కేంద్రం ధీమా అని అన్నారు. రాష్ట్ర సమస్యలపై బీజేపీ తెలుగు నేతలు ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిద్రపోతున్నారా? జీవీఎల్ నోరు పడిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు.
Next Story