విధుల్లో చేరేవారిని అడ్డుకుంటే క‌ఠిన‌చ‌ర్య‌లు : సీపీ సజ్జనార్

By Medi Samrat  Published on  3 Nov 2019 9:27 AM GMT
విధుల్లో చేరేవారిని అడ్డుకుంటే క‌ఠిన‌చ‌ర్య‌లు : సీపీ సజ్జనార్

ముఖ్యాంశాలు

  • భ‌ద్ర‌త క‌ల్పిస్తాం: సీపీ స‌జ్జ‌నార్
  • అడ్డుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు

సీఎం కేసీఆర్ 5వ తేదీ లోపు ఆర్టీసీ ఉద్యోగులను విధులలో చేరడానికి అవకాశం కల్పించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న వారికి పోలీస్ శాఖ నుండి పూర్తి రక్షణ, భద్రత కలిపిస్తామని సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉంటే నిర్భయంగా చేరవచ్చన్నారు.

సీఎం పిలుపుమేరకు.. విధుల్లో చేరుతున్న ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, భౌతిక దాడులకు పాల్పడినా, వారికి ఏ విధమైన నష్టం కలుగజేసినా అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఉద్యోగంలో తిరిగి చేరాలనుకునే వారిని ఎవరైనా ఉద్దేదపూర్వకంగా అడ్డగించినా.. ఘెరావ్ చేసినా.. బెదిరింపులకు పాల్పడినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టతనిచ్చారు.

ఆయా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని సంబంధిత పోలీస్ అధికారులకు నేరుగా ఫోన్ చేయవచ్చన్నారు. డయల్ 100 లేదా సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ 9490617444 నంబర్లలో సంప్రదించవచ్చు.

Next Story