భారత్‌లో 18లక్షలు దాటిన కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2020 5:54 AM GMT
భారత్‌లో 18లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18లక్షలు దాటింది. గత కొద్ది రోజులుగా నిత్యం 50వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 52,972 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,03,695కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 11,86,203 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 5,79,357 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో రికవరీ రేటు 65.77శాతంగా ఉంది.

నిన్న ఒక్క రోజే 771 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 38,135కి చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,02,02,858 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. ఇక అత్యధిక కరోనా మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Next Story