కరోనా వైరస్‌లో కీలక పరిణామం.. వ్యాక్సిన్‌ కనిపెట్టిన భారత శాస్త్రవేత్త

By సుభాష్  Published on  7 Feb 2020 5:35 AM GMT
కరోనా వైరస్‌లో కీలక పరిణామం.. వ్యాక్సిన్‌ కనిపెట్టిన భారత శాస్త్రవేత్త

కరోనా వైరస్‌ పేరు వింటేనే దేశమంత వణికిపోతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్‌ వల్ల చైనాలో ఇప్పటి వరకు చాలా మంది మృత్యువాత పడ్డారు. చైనా నుంచి ఈ వైరస్‌ ఇతర దేశాలతో పాటు, భారత్‌లోకి కూడా ప్రవేశించింది. త్రిపురాలో ఒకరు మృతి చెందగా, కేరళలో ఇద్దరికి సోకింది. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. కరోనా వైరస్‌కు మందులు లేకపోవడంతో వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ శాస్త్రవేత్త నేతృత్వంలో ఆస్ట్రేలియా బృందం వైరస్‌ విరుగుడుకు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు కీలక పురోగతి సాధించింది. ఆస్ట్రేలియాలోని కామన్వేల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ హైసెక్యూరిటీ ల్యాబ్‌ పరిశోధనల్లో ఈ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టారు.

రక్తం నుంచి కరోనా వైరస్‌ను వేరు చేయగలిగాం

పరిశోధకులు గత వారం కరోనా సోకిన వ్యక్తి రక్త నమూనాలను సేకరించి రక్తం నుంచి వైరస్‌ను వేరు చేయగలిగారు. తాజాగా సీఎస్‌ఐఆర్‌ఓ పరిశోధనలో ప్రాథమిక అధ్యయనంలో వైరస్‌ పెరుగుదలను కూడా గుర్తించారు. ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న భారతీయ సంతతి శాస్త్రవేత్త ఎస్‌ఎస్‌ వాసన్‌ మాట్లాడుతూ.. రక్త నమూనాల నుంచి వైరస్‌ను వేరు చేయగలిగామని, ప్రస్తుతం వ్యాక్సిన్‌ అభివృద్ధి దశలో ఉందని, వైరస్‌ సోకిన వారిపై నేరుగా ప్రయోగించి, దాని సమర్థతను పరీక్షిస్తామన్నారు. ఇది మరింత వేగవంతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. అయితే ఎమర్జేన్సీ ప్రిపేరేడ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ భాగస్వామ్యంతో సీఎస్‌ఐఆర్‌ఓ చేపట్టిన ఈ వ్యాక్సిన్‌ ప్రాజెక్టులో ప్రొఫెసర్‌ వాసన్‌ ప్రధాన పరిశోధకుడిగా ఉన్నారు. ఆస్ట్రేలియా జంతు ఆరోగ్య ల్యాబొరేటరీలో తన సహచరులతో కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ, చికిత్స గురించి పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వ్యాక్సిన్‌ అభివృద్ధికి శ్రమిస్తున్నాం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ధీటుగా ఎదుర్కొనేందుకు పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు శ్రమిస్తున్నామని డాక్టర్‌ వాసన్‌ చెప్పారు. ఇప్పటికే కరోనా విరుగుడుకు వ్యాక్సిన్‌ కనుగొని ఒక దశకు తీసుకువచ్చామని, దానిని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.

Next Story