భారత్‌లో 62లక్షలు దాటిన కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sep 2020 5:20 AM GMT
భారత్‌లో 62లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 80,472 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1179 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 62,25,763కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 51,87,826 మంది కోలుకోగా.. ప్రస్తుతం 9,40,441 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 97,497 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.33శాతం ఉండగా.. మరణాలు రేటు 1.57శాతంగా ఉంది.

నిన్న ఒక్కరోజే 10,86,688 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,41,96,729 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. 74లక్షల కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది.

Next Story