తెలంగాణలో కరోనాతో ఇద్దరు మృతి..
By తోట వంశీ కుమార్ Published on 20 April 2020 4:24 PM GMTతెలంగాణలో కరోనా వైరస్తో సోమవారం మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 23కి చేరింది. కాగా.. నేడు ఒక్కరోజే 14 కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 14 కేసుల్లో 12 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా.. మేడ్చల్, నిజామాబాద్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది. మొత్తంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 872 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లోంచి 186 మంది కోలుకోని డిశ్చారి కాగా.. 663 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మే 7 వరకు తెలంగాణలో లాక్డౌన్ను పొడిగించిన సంగతి తెలిసిందే.
Also Read
సడలింపుల్లేవ్.. మే 7 వరకు లాక్డౌన్Next Story