ఆ కానిస్టేబుల్ 'రియల్ హీరో'.. ఎందుకంటే.?!
By Medi Samrat Published on 28 Oct 2019 7:33 AM GMTఆ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విధుల్లో అలర్ట్ గా ఉండటం వలన.. ఓ ప్రయాణికుడి నిండు ప్రాణం నిలిచింది. 26వ తేదినాడు కోయంబత్తూర్ స్టేషన్ వద్ద, 56712 నంబరు గల కదిలే రైలు ఎక్కతూ.. ఒక ప్రయాణికుడు జారిపోయాడు. ఆన్ డ్యూటీ కానిస్టేబుల్ పి. వి. జయన్ ఆ వ్యక్తిని త్వరగా కోచ్ లోపలికి తోసాడు. ఒక్క క్షణంలో గాల్లో కలిసిపోయే ప్రయాణికుడి ప్రాణాలను కాపాడి ఆ కానిస్టేబుల్ రియల్ హీరో అయ్యాడు. కానిస్టేబుల్ ఆ ప్రయాణికుడిని కాపాడే దృశ్యాలు రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అలాగే.. కదులుతున్న రైలు ఎక్కడం ప్రమాదం అని కూడా హెచ్చరించింది.
Next Story