సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2020 6:53 AM GMT
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో జగన్‌ భేటీ కావాల్సి ఉంది. ఈ భేటిలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించాల్సి ఉంది. కాగా.. అమిత్‌ షా షెడ్యూల్‌ మారడం వల్ల జగన్‌ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. ఢిల్లీ టూర్‌లో భాగంగా కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో జగన్‌ పర్యటన వాయిదా పడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. -

Next Story