ఏపీ: ఈనెల 20 నుంచి సిటీ బస్సులు

By సుభాష్  Published on  12 Sep 2020 2:46 AM GMT
ఏపీ: ఈనెల 20 నుంచి సిటీ బస్సులు

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని రంగాలతో పాటు బస్సు సర్వీసులు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు ప్రారంభం కాలేదు. ఇక ఈ బస్సు సర్వీనులను ఈనెల 20వ తేదీ నుంచి నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. 20వ తేదీ నుంచి 26 వరకు గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల రాత పరీక్షలు ఉండటంతో దాదాపు పది లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.

ఈ నేపథ్యంలో ఈ బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది ఏపీ ఆర్టీసీ. అందుకు తగినట్లుగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెల్త్‌ ప్రోటోకాల్‌ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడపనున్నారు. ఈ మేరకు ఏపీ ఆర్టీసీ సిద్ధం చేసిన ప్రణాళికలను వైద్య ఆరోగ్య ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి అనుమతి కోసం పంపింది. ఏపీ సీఎస్‌ నీలం సాహ్నితో జవహార్‌రెడ్డి నిర్ణయం తీసుకుని అనుమతి ఇస్తారని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

Next Story