త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం
By సుభాష్Published on : 12 Sept 2020 10:53 AM IST

త్రిదండి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఈ రోజు శంషాబాద్ ఆశ్రమం దగ్గర జరగనున్నాయి. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మరణించారు. మాతృమూర్తి మరణించడంతో చినజీయర్ స్వామి విషాదంలో మునిగిపోయారు. తల్లి మంగతాయారు మరణం తట్టుకోలేకపోతున్న చినజీయర్ స్వామి.. తల్లితో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకున్నారు.
Next Story